కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ

  • రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో చర్చ
  • ఈ రోజు రాత్రికి ఢిల్లీలోనే జగన్ బస
  • రేపు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశం
కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో చర్చిస్తున్నారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, హైకోర్టు తరలింపు, శాసనమండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
కాగా, ఈ రోజు రాత్రికి ఢిల్లీలోనే జగన్ బస చేయనున్నారు. రేపు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నట్టు సమాచారం.

Jagan
YSRCP
Amit Shah
BJP
central minister

More Telugu News